మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి విచ్చేయగా జిల్లా లోని అన్ని యూనిట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి 46 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనిట్ల లోని అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్ ప్రశాంత్,ఎన్జీవో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, మంచిర్యాల యూనిట్ సభ్యులు ప్రకాష్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి