ఆసిఫాబాద్ ప్రత్యేక్షత:- ఆదివాసుల ఆరాధ్య దైవం, అమరజీవి కుమ్రంభీమ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని జిల్లా కలెక్టర్ వెంకటేష్, ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని కెరమెరి మండలం జోడెన్ ఘాట్ లో ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ 85వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్.పి. కాంతిలాల్ సుభాష్ పాటిల్, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా గిరిజనాభివద్ధి అధికారి రమాదేవి, కుమ్రంభీమ్ మనుమడు కుమ్రం సోనే రావు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయబద్ధంగా జండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కుమ్రంభీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి సమాధి వద్ద నివాళులు అర్పించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుమ్రంభీమ్ మనుమడు కుమ్రం సోనే రావు దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ అని అన్నారు. భీమ్ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమంలో ముందుకు సాగుదామని తెలిపారు. కుమ్రంభీమ్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. కుమ్రంభీమ్ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేందుకు హట్టి నుండి జోడెన్ ఘాట్ వరకు ఉచితంగా ప్రయాణించేందుకు బస్సులు నడిపించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి