
మంచిర్యాల ప్రత్యక్షత:- స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకింఛంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం వందేమాతర గీతాలాపన కార్యక్రమం మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీఏవో రమేష్, డిప్యూటీ తహసిల్దార్ శ్రీహరి కార్యాలయ సిబ్బంది సామూహిక వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు.