-ముఖ్యఅతిథి మున్సిపల్ కమిషనర్ రాజు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత :- క్యాతన పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్డేడియం వద్ద గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 40మంది విద్యార్థులకు మున్సిపాలిటీ కమీషనర్ రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు చెప్పగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె,గేట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి, కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.