-బట్ట సంచుల పంపిణీతో అవగాహన

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని బీ జోన్ సెంటర్లో ప్రపంచ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ సేవా సంఘం ఆధ్వర్యంలో బట్ట సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నులిగొండ సత్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా మానుకుని బట్ట సంచులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, జీవరాశులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రాంత బాధ్యులు మంద వేణు, మాజీ అధ్యక్షుడు వనం సత్యనారాయణ, ద్వితీయ ఉపాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు వేముల వెంకటేశం, రాజేష్ కన్నా, సభ్యుడు గోక శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రజలకు బట్ట సంచులను పంపిణీ చేశారు.

