
మంచిర్యాల ప్రత్యక్షత:- హాజీపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ పుష్పలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గం నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని బీఎల్వోలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఎలా అమలు చేయాలనే అంశంపై అవగాహన కల్పించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ సహాయకులు సంజీవ్, మండల గిర్దావర్లు ప్రభు, మంగ పాల్గొన్నారు.


