
మందమర్రి ప్రత్యక్షత:-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, మందమర్రి పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ ఆధ్వర్యంలో మార్కెట్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీల హక్కుల సాధన కోసం జాజుల శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషిని కొనియాడారు. బీసీలకు స్వంత మీడియా అవసరమనే లక్ష్యంతో హైదరాబాద్లో జె ఎస్ పి మీడియా పేరుతో కొత్త ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆయన నాయకత్వంలో పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బేర వేణుగోపాల్, రాయబారపు కిరణ్, మడ్డి వేణుగోపాల్ గౌడ్, ఎండి.ఖలీం, సత్యనారాయణ, మధుకర్, మొగిలి, చీర్ల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


