-టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్కారం

మంచిర్యాల ప్రత్యక్షత:-ప్రభుత్వ సేవల్లో దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది.రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు గౌరవం ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో 39 సంవత్సరాల సేవల అనంతరం పదవీ విరమణ పొందిన తహసీల్దార్ పిన్న రాజేశ్వర్, 40 సంవత్సరాలు సేవలందించిన తహసీల్దార్ పుప్పాల హనుమంతరావు దంపతులను సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఎంపీడీఓ ఎంఏ. హై ని కూడా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, క్రమశిక్షణతో ప్రజాసేవ చేసిన అధికారులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.ఉద్యోగులకు మార్గదర్శకులు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, సన్మానిత అధికారులు ఉద్యోగులకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు, యూనిట్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.


