
హైదరాబాద్ ప్రత్యక్షత:-నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), సెషన్స్ డివిజన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, జుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. యోగ, ప్రాణాయామం, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి విశిష్టత గురించి యోగ మాస్టర్, న్యాయవాది కొట్టే నటేశ్వర్ మరియు డాక్టర్ పూనమ్ వివరించారు. అనంతరం యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.తదనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు, జుడిషియల్ అధికారులు మరియు సిబ్బంది యోగ మాస్టర్లను సన్మానించారు.ఈ సందర్భంగా యోగ మాస్టర్ నటేశ్వర్ మాట్లాడుతూ, యోగ అనేది చిన్నా పెద్దా, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చని, ఆరోగ్యంగా జీవిస్తూ అనారోగ్యాన్ని జయించవచ్చని తెలిపారు. “రోగం భోగం వద్దు-యోగం ముద్దు” అనే సందేశాన్ని అందించారు.

