
బెల్లంపల్లి ప్రత్యక్షత:-ఇటీవల పదవీ విరమణ పొందిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా (తహసిల్దార్) విధులు నిర్వహించిన పుప్పాల హనుమంతరావు, ఆయన సతీమణి జ్యోతి దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో హనుమంతరావు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత యువ ఉద్యోగులకు మార్గదర్శకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రెవెన్యూ శాఖ ఉద్యోగులకు తన అనుభవంతో సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు కందుకూరి సురేష్ బాబు, మాజీ కార్యదర్శి భూముల రామ్మోహన్, టీజీవో జగిత్యాల అధ్యక్షుడు కందుకూరి రవిబాబు, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

