-వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రతిభావంతులకు సత్కారం
-ఆగస్టు 18 వరకు దరఖాస్తులకు అవకాశం

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించేందుకు తెలుగు సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు తెలంగాణ సంస్కృతి సాహిత్య బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మాచవరం గౌరీశంకర్ మరియు బట్టు శ్రీనివాస్ రావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.సమాజానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి వారి సేవలను గౌరవించడం, మరింత మందికి స్ఫూర్తిగా నిలిచేలా ప్రోత్సహించడం ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి జాతీయ నవస్పూర్తి, నవకీర్తి, మహానంది, స్వర్ణనంది, స్వర్ణ కంకణం, ఐరావతం, కామధేనువు, మయూరి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్, లెజెండరీ అవార్డు వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.అర్చకులు, జర్నలిస్టులు, సామాజిక సేవకులు, ఆధ్యాత్మికవేత్తలు, రచయితలు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు, నృత్య కళాకారులు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం, శిల్పకళ, రంగస్థల కళాకారులు, జానపద కళాకారులు, మిమిక్రీ కళాకారులు, అవధానులు, విద్యా రంగ నిపుణులు, వైద్యులు, ఇంద్రజాల కళాకారులు, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ కళాకారులు, జ్యోతిష్య నిపుణులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాస్తు, యోగా, డోలక్, హార్మోనియం, భజన కళాకారులు, క్రీడాకారులు, షార్ట్ ఫిలిం రంగ ప్రతిభావంతులు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అలాగే ఇతర రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారు ఈ జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా, తమ తమ రంగాల్లో అసాధారణ సేవలు అందించి సమాజంపై విశేష ప్రభావం చూపిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు కూడా ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా సేవా భావం కలిగిన వ్యక్తులకు గుర్తింపు లభించడంతో పాటు యువతకు ఆదర్శంగా నిలిచే అవకాశముంటుందని వారు అభిప్రాయపడ్డారు.ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 18లోపు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 23, 2026న హైదరాబాద్ నాంపల్లిలోని ది సిటీ పార్క్ హోటల్లో నిర్వహించే ప్రత్యేక పురస్కార ప్రదానోత్సవంలో జాతీయ అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.పురస్కారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం మరియు ఇతర సమాచారం కోసం 99852 75385 సెల్ నంబర్ను సంప్రదించాలని ట్రస్ట్ నిర్వాహకులు కోరారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

