తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి,కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం బుదవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిశారు.ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని శాలువాతో సత్కరించించడం జరిగింది సమావేశంలో కీలకంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందన్నారు,భవిష్యత్ కార్యాచరణ పై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశనిర్దేశం చేసినట్లు తెలిపారు.తెలంగాణకు చెందిన 18 మంది బిజెపి ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం మరియు కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బిజెపి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి