
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్సింగ్నగర్కు చెందిన పిన్నింటి మహేందర్ (39) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వివాహ విషయమై తల్లిదండ్రులతో గొడవపడిన అనంతరం ఇంటి బయట ఉన్న షెడ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు వెళ్లేందుకు తండ్రి పిలిచినా స్పందించకపోవడంతో పరిశీలించగా మహేందర్ విగతజీవిగా కనిపించాడు. తండ్రి ఫిర్యాదుతో రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

