
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న యువకులపై రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురు యువకులను గుర్తించిన పట్టణ ఎస్సై శ్రీధర్ వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని వారికి అవగాహన కల్పించారు. అనంతరం సంబంధిత యువకులపై పెట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ, పట్టణంలో పార్కులు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతిరోజూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై సమాచారం అందించాలని, పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.


