మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో టీజీఈజేఏసీ చైర్మన్ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి,ఉద్యోగుల సమస్యలు సాధించడానికి ఉద్యోగులందరూ మారం జగదీశ్వర్ కి అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు కేజియా రాణి, రామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి రవి కిరణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి