
మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా మొట్టమొదటిసారిగా ఎన్నికల నిర్వహిస్తున్న జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 50వ డివిజన్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో బుధవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు టిజీఈజేఏసి జిల్లా కన్వీనర్ గడియారం శ్రీహరి, ఆయన సతీమణి పల్లవి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును తాను వినియోగించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.