
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నస్పూర్ ఐడీఓసీలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ, ఇరిగేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, అటవీశాఖ కార్యాలయాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు, న్యాయమైన డిమాండ్లపై సమావేశాల్లో చర్చించారు. అటెండర్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఉద్యోగి మహాధర్నాలో పాల్గొని ఐక్యంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని శ్రీహరి కోరారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు, టీఎన్జీఓలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

