హోమ్ టాప్ న్యూస్ మంచిర్యాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష

మంచిర్యాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష

0

-రాజకీయ పార్టీలు బీసీలపై చిత్తశుద్ధిగా వ్యవహరించాలి

-ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను చేపట్టారు. అంబేద్కర్ కు పూలమాల వేసి బీసీ జేఏసీ నాయకులు కు బీసీ జేఏసీ జిల్లా కుల సంఘాల నాయకులు సంగెపు ఎల్లయ్య, వైద్య భాస్కర్, రాజేశం గౌడ్, పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా కో-ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్, జాతీయబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీసీజేఏసీ జిల్లా నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుకూలంగా బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకురావాలని అన్నారు. కానీ కొంతమంది అగ్రకుల నాయకులు బీసీల రిజర్వేషన్లను సహించలేక తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. బీసీలకు రావలసిన రిజర్వేషన్లను అడ్డుకోవడం మూలంగా స్థానిక సంస్థలలో బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్ రాకుండా పోవడం వల్ల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను ప్రారంభించామని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ పైన చిత్తశుద్ధిగా వ్యవహరించాలని, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా పార్లమెంటులో చట్ట సవరణ చేసి 9 షెడ్యూల్లో పెట్టి బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లను అందించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బీసీ ప్రజలు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తామని అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు బీసీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అఖిలపక్ష కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తున్న బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోవాలని బీసీ జేఏసీ కోరారు. దశాబ్దాల కాలంగా జరుగుతున్న బీసీ రిజర్వేషన్ పోరాటం తుది దశకు చేరిందని ఈ పోరాటాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని లేనిపక్షంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ప్రజలందరి చేత తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమాలను చేయడానికి బీసీ జేఏసీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు కొండిల్ల శ్రీనివాస్,కర్రే లచ్చన్న,కట్కోజుల రమణ,యాదబోయిన రాజన్న యాదవ్, సంగేపు ఎల్లన్న , వైద్య భాస్కర్, దేవసాని నాగరాజు, దుర్గం రాజేశం గౌడ్, ముదరపు శేఖర్, మడ్డి వేణుగోపాల్,జాడ క్రాంతి కుమార్, ఎండి ఖాసీమ్,బీసీ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version