హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

0

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ప్రభుత్వ ఐటీఐ,నర్సింగ్ కళాశాల,రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్ లు విచ్చేసి ప్రభుత్వ ఐటీఐ లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 102 మంది టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..

జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు నిరంతరాయంగా కష్టపడి అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి వై.రమేష్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శి పద్మ లత, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్, ప్రశాంత్ ఉపాధ్యక్షులు ప్రకాష్ ఐటీఐ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version